ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, ఐదేళ్ల ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్-2023), ఏపీ పీజీ లా కామన్ ఎంట్రన్స్ _ టెస్ట్ (ఏపీ పీజీఎల్ సెట్-2023) నోటిఫికేషనన్ను విడుదల చేసింది. ఈ పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
» కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు.
» అర్హత: మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐదేళ్ల ఎలీల్బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్ఎల్ఎం కోర్సుకు ఎల్ఎల్బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.
» పరీక్ష మాధ్యమం:లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, పీజీ ఎల్సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుం లేకుండా): 22.04.2023.
» హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభతేది: 15.05.2023
» పరీక్ష తేదీ: 20.05.2023.
» వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |