ఏపీ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న వారితో పాటు పాసైన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు http://polycetap.nic.in సైట్ను చూడొచ్చు.