- 30 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
- 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ… ఏప్రిల్ 6 వరకు గడువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ లో 30 జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో 24 పోస్టులను ప్రత్యక్ష భర్తీ ద్వారా, ఆరు పోస్టులను రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు హైకోర్టు వెబ్సైట్ (ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చారు.
ఏప్రిల్ 24న కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 40, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు అనుమతిస్తారు.
ఓసీ 15, ఈడబ్ల్యూ ఎస్-3, బీసీ-ఏ 3, బీసీ-బీ 1, బీసీ-సీ 1, బీసీ-డీ 1, బీసీ-ఈ 1, ఎస్సీ-4, ఎస్టీ-1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) నోటిఫికేషన్ విడుదల చేశారు.